BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చనుబండ పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 05:44 PM
16 వీక్షణలు

చనుబండ పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ పరిశీలన

చాట్రాయి మండలం చనుబండ ఉన్నత పాఠశాలలో పనిచేయకుండా ఉన్న ఆర్‌వో ప్లాంట్‌ను నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సురక్షితమైన మంచినీరు తాగడం ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అన్నారు.

ఈ పరిశీలనలో చాట్రాయి ఇంచార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రనాథ్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఆర్‌వో ప్లాంట్ పనిచేయడం లేదని, ప్లాంట్‌ను సరఫరా చేసిన సంస్థ ప్రతినిధులకు మరమ్మతుల కోసం పలుమార్లు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు మెకానిక్ రాలేదని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

దీనిపై స్పందించిన ఇంచార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ సంస్థ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే మెకానిక్‌ను పంపించి ప్లాంట్‌ను మరమ్మతు చేయాలని ఆదేశించారు. దీనికి స్పందించిన సంస్థ ప్రతినిధులు త్వరితగతిన మెకానిక్‌ను పంపించి ఆర్‌వో ప్లాంట్‌ను మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు.