BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పుంగనూరులో ఘనంగా బీసీవై పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Jul, 2026 - 06:16 PM
9 వీక్షణలు

పుంగనూరులో ఘనంగా బీసీవై పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు, జూలై 23: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై పార్టీ) 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పుంగనూరు పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ  ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ సేవా భావాన్ని చాటిచెప్పారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు  *"నిన్నటి కల... నేటి ఉద్యమం... రేపటి భరోసా..*!" అనే సందేశాన్ని ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని, బీసీల ఆత్మగౌరవ పరిరక్షణ, యువతకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడం, సామాజిక న్యాయం సాధించడమే బీసీవై పార్టీ ఆశయమని పేర్కొన్నారు.

మూడేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ బీసీవై పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో పార్టీ మరింత బలోపేతమై 2029లో ప్రజా ఆశయాల సాధన దిశగా విజయపథంలో ముందుకు సాగుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.