పుంగనూరులో ఘనంగా బీసీవై పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
పుంగనూరులో ఘనంగా బీసీవై పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు, జూలై 23: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై పార్టీ) 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పుంగనూరు పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ సేవా భావాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారు *"నిన్నటి కల... నేటి ఉద్యమం... రేపటి భరోసా..*!" అనే సందేశాన్ని ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని, బీసీల ఆత్మగౌరవ పరిరక్షణ, యువతకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడం, సామాజిక న్యాయం సాధించడమే బీసీవై పార్టీ ఆశయమని పేర్కొన్నారు.
మూడేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ బీసీవై పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో పార్టీ మరింత బలోపేతమై 2029లో ప్రజా ఆశయాల సాధన దిశగా విజయపథంలో ముందుకు సాగుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.