BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డా. వి. రవీంద్ర

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 05:45 PM
10 వీక్షణలు

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డా. వి. రవీంద్ర

తిరువూరు, జూలై 23: వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు వీటి పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు డా. వి. రవీంద్ర సూచించారు.

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణపై రూపొందించిన కరపత్రాలను గురువారం తిరువూరులోని జ్యోతి నర్సింగ్ హోంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. హరికృష్ణ, జిల్లా కార్యదర్శి ఎం. రాంప్రదీప్, తిరువూరు మండల అధ్యక్షుడు పి. శీనయ్య, ఏ. కొండూరు మండల గౌరవాధ్యక్షుడు పి. శోభన్ బాబు, గంపలగూడెం ప్రధాన కార్యదర్శి బి. సైదులు, నాయకులు ఎస్.డి. సుభాని, పి.వి. శరత్ బాబు, పి. రామకృష్ణ, కె. వెంకటేశ్వరరావు, నాగ శిరోమణి, అలీ బాబా తదితరులు పాల్గొన్నారు.