www.ntodaynews.com
ఏలూరు ఇండోర్ స్టేడియంలో కూటమి పార్టీల సభ – జిల్లా ముఖ్యనేతలతో పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు ఇండోర్ స్టేడియంలో “రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం” అనే అంశంపై కూటమి పార్టీల ఆధ్వర్యంలో సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ముఖ్యనేతలు హాజరయ్యారు.
ఈ సభలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎంపీ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై సభలో చర్చ జరిగినట్లు సమాచారం.