ఏలూరు జిల్లా చింతంపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం
ఏలూరు జిల్లా చింతలపూడి (మం) పరిధిలోని చింతంపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప శివ కిషోర్ ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్ మరియు ఇతర సిబ్బంది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
పర్యటన సమయంలో అధికారులు గ్రామ ప్రజల సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువతకు వాలీబాల్ పోటీలు, మహిళలకు వివిధ రకాల ఆటలు నిర్వహించబడ్డాయి.
అధికారులు గ్రామ యువత సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలలో పాల్గొని ప్రతిభను చూపాలని ఆకాంక్షించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని గమనిక ఇచ్చారు.
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.