BREAKING
​గాలివాన బీభత్సానికి చిట్యాల అతలాకుతలం ​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం ​గాలివాన బీభత్సానికి చిట్యాల అతలాకుతలం ​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం
www.ntodaynews.com

నాణ్యతా ప్రమాణాలు లేని భవనాలపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 05:45 PM
69 వీక్షణలు

ఏలూరు జిల్లా: నాణ్యతా ప్రమాణాలు లేని భవనాలపై ఆగ్రహం

ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో, శెట్టి వారి గూడెం రహదారి వద్ద నిర్మించిన ఎనిమిది భవనాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడంతో నివాసమున్న కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భవనాలు సుమారు రెండు సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి, అయితే, నెమ్మదిగా వాటి నిర్మాణం మరింత అస్థిరంగా మారింది. స్లాబ్ నుండి నీరు కారడం, పాత గుడ్డలు, స్పాంజీలు బయటపడటం వంటి సమస్యలు నివాసుల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఈ ఇళ్లను కొనుగోలు చేసిన మధ్యతరగతి కుటుంబాలు, 38 లక్షల రూపాయలు అప్పు చేసి సొంత ఇల్లు కాగాలని ఆశపడి కొనుగోలు చేశారని, కానీ ఇప్పుడు అవి తన శాపంగా మారాయని బాధితులు చెప్పుతున్నారు.

ఈ భవనాల నిర్మాణం, గత పంచాయతీ అధికారుల అనుమతులతో జరిగింది. అయితే, ఇప్పుడు చింతలపూడి నగర పంచాయతీగా అభివృద్ధి అవ్వడంతో, కొత్త భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసే ముందు పర్యవేక్షణ తప్పనిసరి అని స్థానికులు సూచిస్తున్నారు.

సంబంధిత అధికారులు, నిర్మాణ నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించడంలో నిర్లక్ష్యానికి గురైనట్లు వ్యాఖ్యానించారు. స్థానికులు, నూతన భవనాలను నిర్మించే పెద్ద వ్యాపారులను విచారించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ సమస్యపై స్థానిక ప్రజల నిరసన పెరుగుతున్నది.