BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

నాణ్యతా ప్రమాణాలు లేని భవనాలపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 05:45 PM
148 వీక్షణలు

ఏలూరు జిల్లా: నాణ్యతా ప్రమాణాలు లేని భవనాలపై ఆగ్రహం

ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో, శెట్టి వారి గూడెం రహదారి వద్ద నిర్మించిన ఎనిమిది భవనాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడంతో నివాసమున్న కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భవనాలు సుమారు రెండు సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి, అయితే, నెమ్మదిగా వాటి నిర్మాణం మరింత అస్థిరంగా మారింది. స్లాబ్ నుండి నీరు కారడం, పాత గుడ్డలు, స్పాంజీలు బయటపడటం వంటి సమస్యలు నివాసుల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఈ ఇళ్లను కొనుగోలు చేసిన మధ్యతరగతి కుటుంబాలు, 38 లక్షల రూపాయలు అప్పు చేసి సొంత ఇల్లు కాగాలని ఆశపడి కొనుగోలు చేశారని, కానీ ఇప్పుడు అవి తన శాపంగా మారాయని బాధితులు చెప్పుతున్నారు.

ఈ భవనాల నిర్మాణం, గత పంచాయతీ అధికారుల అనుమతులతో జరిగింది. అయితే, ఇప్పుడు చింతలపూడి నగర పంచాయతీగా అభివృద్ధి అవ్వడంతో, కొత్త భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసే ముందు పర్యవేక్షణ తప్పనిసరి అని స్థానికులు సూచిస్తున్నారు.

సంబంధిత అధికారులు, నిర్మాణ నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించడంలో నిర్లక్ష్యానికి గురైనట్లు వ్యాఖ్యానించారు. స్థానికులు, నూతన భవనాలను నిర్మించే పెద్ద వ్యాపారులను విచారించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ సమస్యపై స్థానిక ప్రజల నిరసన పెరుగుతున్నది.