www.ntodaynews.com
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం ఎపుగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
రాత్రి సమయంలో మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ట్రాక్టర్పై మైనర్ బాలుడు డ్రైవర్గా ఉన్నట్లు సమాచారం. అదే ట్రాక్టర్పై కూర్చున్న ఎంగిర్తి వినయ్ (17) అనే బాలుడు మరో బాలుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు.
ఈ క్రమంలో మరో బాలుడు సెల్ఫోన్ జారిపడడంతో దాన్ని తీసుకునేందుకు ట్రాక్టర్ నుంచి దిగాడు. అదే సమయంలో మైనర్ డ్రైవర్ అనుకోకుండా యాక్సిలరేటర్పై కాలు వేయడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు కదిలింది.
దీంతో ట్రాక్టర్ టైర్ కింద పడిన వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.