BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం ఎపుగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 06:25 AM
61 వీక్షణలు

రాత్రి సమయంలో మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ట్రాక్టర్‌పై మైనర్ బాలుడు డ్రైవర్‌గా ఉన్నట్లు సమాచారం. అదే ట్రాక్టర్‌పై కూర్చున్న ఎంగిర్తి వినయ్ (17) అనే బాలుడు మరో బాలుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు.

ఈ క్రమంలో మరో బాలుడు సెల్‌ఫోన్ జారిపడడంతో దాన్ని తీసుకునేందుకు ట్రాక్టర్ నుంచి దిగాడు. అదే సమయంలో మైనర్ డ్రైవర్ అనుకోకుండా యాక్సిలరేటర్‌పై కాలు వేయడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు కదిలింది.

దీంతో ట్రాక్టర్ టైర్ కింద పడిన వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.