www.ntodaynews.com
కోర్ట్ కేసుల్లో సమర్థవంతమైన విచారణకు గుర్తింపు – చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్కు ఉత్తమ పురస్కారం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలో 2025–2026 సంవత్సరంలో నమోదైన కీలక కేసుల్లో సాక్షుల హాజరు, ఆధారాల సమర్పణ, విచారణ ప్రక్రియలను సమయానికి పూర్తి చేస్తూ జీవితఖైదు, జైలు శిక్షలు పడేలా సమర్థంగా విధులు నిర్వర్తించినందుకు పోలీస్ అధికారులకు గుర్తింపు లభించింది.
ఈ నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ G.V.G. అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ K. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా చింతలపూడి సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
కోర్ట్ కేసుల సమన్వయం, సాక్ష్యాల బలపరిచే చర్యలు, కేసుల వేగవంతమైన పరిష్కారానికి చేసిన కృషిని ఉన్నతాధికారులు అభినందించారు.