BREAKING
మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
Date of Publish : 25 March 2026, 09:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ అసెంబ్లీలో మహిళా ఓటర్ల హాట్‌స్పాట్లు – భీమిలి టాప్..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:26 PM
119 వీక్షణలు

ఏపీ అసెంబ్లీలో మహిళా ఓటర్ల హాట్‌స్పాట్లు – భీమిలి టాప్..!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల జాబితా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యం పెరుగుతున్న నేపథ్యంలో, కొన్ని నియోజకవర్గాలు మహిళా ఓటర్ల అధిక సంఖ్యతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

ఈ జాబితాలో భీమిలి నియోజకవర్గం 1,65,570 మంది మహిళా ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీని తరువాత పాణ్యం (1,54,460), గాజువాక (1,53,505), చంద్రగిరి (1,47,522), తిరుపతి (1,44,295) నియోజకవర్గాలు టాప్‌లో నిలిచాయి.

అలాగే మంగళగిరి (1,41,514), పెనమలూరు (1,40,953), రంపచోడవరం (ఎస్టీ) (1,40,090), పెందుర్తి (1,39,430), గురజాల (1,38,055), విశాఖపట్నం నార్త్ (1,37,949) వంటి నియోజకవర్గాలు కూడా మహిళా ఓటర్ల సంఖ్యలో ముందంజలో ఉన్నాయి.

ఇక మిగిలిన ప్రముఖ నియోజకవర్గాల్లో

కోవూరు, కర్నూలు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల వంటి ప్రాంతాలు కూడా లక్షకు పైగా మహిళా ఓటర్లతో కీలక స్థానాల్లో నిలిచాయి.

రెండో దశలో అనంతపురం అర్బన్, ఇచ్ఛాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి (ఎస్సీ), రాజమహేంద్రవరం సిటీ, ప్రత్తిపాడు (ఎస్సీ), గుంతకల్లు, కాకినాడ సిటీ వంటి నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇక మూడో దశలో మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం (ఎస్టీ), కావలి, జమ్మలమడుగు, కొత్తపేట వంటి నియోజకవర్గాలు చోటు దక్కించుకున్నాయి.

చివరిభాగంలో శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, ఆదోని, విజయనగరం, రాయచోటి, కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, గూడూరు (ఎస్సీ), ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి నియోజకవర్గాలు ఉన్నాయి.

తాడిపత్రిలో 1,19,334 మంది మహిళా ఓటర్లు నమోదు అయ్యారు.

 మొత్తంగా చూస్తే, రాష్ట్రంలో మహిళా ఓటర్ల ప్రభావం పెరుగుతున్నట్టు ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో మహిళల ఓటు కీలకంగా మారే అవకాశముంది.