ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు
ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్పరం చేయొద్దని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ పీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య నేతలు, తిరువూరు పట్టణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి మాలపాటి ఉదయ్, అలాగే అఖిల భారత యువజన సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. సుభాని పాల్గొన్నారు.