BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికైన పెదబాబును ఘనంగా సన్మానించిన శాసనసభ్యులు రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 05:28 PM
82 వీక్షణలు

చింతలపూడి వీకేఎం మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికైన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు)ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పెదబాబుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాల్లో పెదబాబు అందిస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని అన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధి అవకాశాల కల్పనలో కూడా పెదబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించి, జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని పెదబాబును అభినందించారు.