ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికైన పెదబాబును ఘనంగా సన్మానించిన శాసనసభ్యులు రోషన్ కుమార్
చింతలపూడి వీకేఎం మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికైన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు)ను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పెదబాబుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాల్లో పెదబాబు అందిస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని అన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధి అవకాశాల కల్పనలో కూడా పెదబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించి, జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని పెదబాబును అభినందించారు.