నవోదయం-2.0 దాడులు: చాట్రాయిలో 2 లీటర్ల నాటు సారా స్వాధీనం.. మహిళపై కేసు నమోదు
ఏలూరు | NTODAY NEWS
నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'నవోదయం-2.0' కార్యక్రమంలో భాగంగా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్దతండా గ్రామంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడుల్లో ధారావతు జ్యోతి అనే మహిళ వద్ద నుంచి 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, ఆమెపై కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.
ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కే. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయాలు, నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటలను కలిగి ఉన్న భూ యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నాటు సారా తయారీ లేదా అక్రమ విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉన్నవారు **ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య (9440902462)**కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.