www.ntodaynews.com
విజయవాడలో సీఆర్ఎంసీ కమిటీ సమావేశం.. పాల్గొన్న జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ పట్టణంలోని ఎన్టీఆర్ సహకార భవన్లో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన సీఆర్ఎంసీ (CRMC) కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు.
రాష్ట్ర సహకార రంగ అభివృద్ధి, జిల్లా సహకార బ్యాంకుల పనితీరు, ఆర్థిక నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) చైర్మన్లు హాజరై, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సహకార బ్యాంకుల పనితీరును మెరుగుపర్చడం, రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.