www.ntodaynews.com
ఏపీలో స్థానిక సంస్థలకు ₹16,627 కోట్ల భారీ నిధులు – 16వ ఆర్థిక సంఘం కేటాయింపు
ఆంధ్రప్రదేశ్
ఏపీ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మొత్తం ₹16,627 కోట్ల నిధులు ఐదేళ్ల కాలానికి (2026-27 నుండి 2030-31 వరకు) విడుదల కానున్నాయి.
ఈ నిధుల్లో
బేసిక్ గ్రాంట్ కింద ₹13,302 కోట్లు
పనితీరు ఆధారిత గ్రాంట్ కింద ₹3,225 కోట్లు
కేటాయించబడినట్లు సమాచారం.
గత 15వ ఆర్థిక సంఘం కేటాయించిన ₹12,800 కోట్లతో పోలిస్తే ఈసారి సుమారు ₹3,800 కోట్లకు పైగా పెరుగుదల నమోదైంది. దీంతో గ్రామీణ అభివృద్ధి పనులు, స్థానిక మౌలిక వసతుల బలోపేతానికి మరింత ఊతం లభించనుంది.