BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

ఏసీబీ దాడుల్లో భూపరిపాలన శాఖ అధికారి ఇంట భారీ అక్రమాస్తులు వెలుగులోకి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 10:18 AM
25 వీక్షణలు

తెలంగాణ భూపరిపాలన, సర్వే విభాగంలో పనిచేస్తున్న మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం హైదరాబాద్‌తో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు చేపట్టిన ఈ తనిఖీల్లో నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు లభ్యమైంది. నగదును బెడ్‌రూమ్‌లోని బీరువా పైభాగంలో దాచినట్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అలాగే సుమారు ఒక కిలో బంగారం, పలు కీలక ఆస్తి పత్రాలు కూడా సీజ్ చేశారు. నారాయణగూడలోని కార్యాలయం, బంధువులు మరియు సన్నిహితుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిపారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.5 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అదనంగా కోటి రూపాయలకు పైగా విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. వాటి పూర్తి వివరాల కోసం సంబంధిత బ్యాంకులకు లేఖలు పంపించారు.

అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది.