BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 May, 2026 - 05:42 PM
157 వీక్షణలు

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

​దండేపల్లి మండల కేంద్రంలో సమ్మె శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

​దండేపల్లి:దండేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఐకేపీ, వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఓఏలు చేపట్టిన సమ్మెకు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన వారు, వీఓఏల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపి, వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు మాట్లాడుతూ... వీఓఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారు చేస్తున్న సమ్మెకు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. 

వీఓఏల ప్రధాన డిమాండ్లు ఇవే:

​వీఓఏలకు నెలకు రూ. 20 వేల కనీస వేతనం ఇవ్వాలి.

​సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలి. 

​అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలి.

​వీఓఏలకు రూ. 20 లక్షల సాధారణ మరియు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలి.

​విధులకు అవసరమైన ట్యాబ్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి.

​58వ ప్రభుత్వ ఉత్తర్వును (జీవో 58) వెంటనే సవరించాలి. 

​ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, సమ్మె నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో వీఓఏలు పాల్గొన్నారు