BREAKING
​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద ​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద ​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి
www.ntodaynews.com

​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 May, 2026 - 05:42 PM
55 వీక్షణలు

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

​దండేపల్లి మండల కేంద్రంలో సమ్మె శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

​దండేపల్లి:దండేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఐకేపీ, వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఓఏలు చేపట్టిన సమ్మెకు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన వారు, వీఓఏల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపి, వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు మాట్లాడుతూ... వీఓఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారు చేస్తున్న సమ్మెకు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. 

వీఓఏల ప్రధాన డిమాండ్లు ఇవే:

​వీఓఏలకు నెలకు రూ. 20 వేల కనీస వేతనం ఇవ్వాలి.

​సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలి. 

​అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలి.

​వీఓఏలకు రూ. 20 లక్షల సాధారణ మరియు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలి.

​విధులకు అవసరమైన ట్యాబ్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి.

​58వ ప్రభుత్వ ఉత్తర్వును (జీవో 58) వెంటనే సవరించాలి. 

​ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, సమ్మె నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో వీఓఏలు పాల్గొన్నారు