BREAKING
గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
www.ntodaynews.com

అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 11:23 AM
9 వీక్షణలు

మదనపల్లి: రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గురువారం మదనపల్లె కలెక్టరేట్లో అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు.

అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపాలని, బెల్ట్ షాపులను కఠినంగా నియంత్రించాలని ఆదేశించారు.

దీనిపై ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు స్పందిస్తూ.. ఇతర శాఖల సమన్వయంతో అక్రమార్కులపై ముమ్మర దాడులు నిర్వహిస్తామని, పదేపదే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని మంత్రికి స్పష్టం చేశారు. బార్లు, మద్యం దుకాణాల వద్ద గొడవలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా పెంచినట్లు తెలిపారు.

మద్యం విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ అధికారులకు సూచించగా, దుకాణాల పరిసరాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారు కోరారు.