BREAKING
​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష త్రాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష ముసునూరు శ్రీ వేంకటాచల స్వామి దేవస్థానం కుంభాభిషేకం అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం ఈనెల 27 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)..... జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ లింగపాలెం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష త్రాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష ముసునూరు శ్రీ వేంకటాచల స్వామి దేవస్థానం కుంభాభిషేకం అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం ఈనెల 27 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)..... జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ లింగపాలెం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
www.ntodaynews.com

గుడిసెలు వేసుకున్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

తెలంగాణ
01 Jul, 2025 - 03:29 AM
168 వీక్షణలు
గుడిసెలు వేసుకున్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ..సిపిఎం NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ -వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియజవర్గంలో కదిరి పట్టణం, కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ సర్వే నెంబర్ 720లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని లబ్ధిదారులతో వ్యక్తిగత అర్జీలు గ్రీవెన్స్ లో సివిల్ సప్లై డిటి గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిఎల్.నరసింహులు మాట్లాడుతూ గత నాలుగు నెలల నుంచి సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో పేదలు వ్యక్తిగత ఆర్జీలు ఇచ్చారన్నారు కనీసం ఇంతవరకు రెవెన్యూ అధికారులు పరిశీలన కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. విధిలేని పరిస్థితిలో పేదలు సర్వేనెంబర్ 720లో గుడిసెలు వేసుకున్నారన్నారు. ఇదివరకే ఆ సర్వే నెంబర్లు కొంతమంది పేదలు ఎన్నికల ముందు పునాదులు వేసిన వారు ఉన్నారు. వీరికి కూడా పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామన్న హామీ ప్రకారం గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేకపోతే నిర్మాణాలు చేపడతామని దీనికి రెవెన్యూ అధికారులదే బాధ్యత అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సాంబశివ, ముస్తాక్, రామ్మోహన్, పేదలు కాంతమ్మ, భారతి, లక్ష్మీదేవి, పుష్ప, సరస్వతి, లక్ష్మీ, మాబున్ని తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube