www.ntodaynews.com
అమరావతి బిల్లు పార్లమెంటులో నెగ్గిన సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
అమరావతి బిల్లు పార్లమెంటులో నెగ్గిన సందర్భాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ, బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు
చిలకలూరిపేట:అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ బిల్లు ద్వారా ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చుతూ తమ ఆనందోత్సాహాలను వెలిబుచ్చారు. అలాగే క్యాంపు కార్యాలయం వద్ద విజయోత్సవ కేక్ ను కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.వేలాది ఎకరాలు భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల కల ఫలించిన ఈ రోజును ప్రతి ఒక్కరూ ఒక పండుగలా జరుపుకోవాలని, ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని అన్న నినాదానికి యావత్తు భారత దేశం లోని అన్ని రాష్ట్రల నుండీ సంపూర్ణ మద్దతు లభించిందని ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కర్త నెల్లూరి సదాశివరావు , వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా , మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ , పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ , ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి , రూరల్ మండల అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ , పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు మురుకొండా మల్లి బాబు , రాష్ట గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల వెంకట రమణ , వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు , జరీనా సుల్తానా , మిరియాల రత్నకుమారి , అమర రమాదేవి , పోపురి లక్ష్మి, అనిత బాయి , జంగా సుజాత , కొత్త కుమారి , కనమర్లపూడి లక్ష్మీ తిరుమల,చేమిటిగంటి పార్వతి , కూనలా ప్రేమిలా , యదాల సుజాత పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.