www.ntodaynews.com
అమరావతికి కేంద్ర వరాలు! అమరావతిలో రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కేంద్రం మరో కీలక అడుగు వేసింది. కేంద్ర క్యాబినెట్ రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా అమరావతి మౌలిక సదుపాయాలు బలోపేతం కాబోతున్నాయి.
సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్
• రూ.1,299 కోట్లతో 5.35 ఎకరాల్లో నిర్మాణం
• కేంద్రం ఆఫీసుల కోసం ఆధునిక కాంప్లెక్స్
కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయం
• రూ.1,235 కోట్లతో 17 ఎకరాల్లో అభివృద్ధి
• కేంద్ర ఉద్యోగులకు సౌకర్యవంతమైన హౌసింగ్
రాజధాని అభివృద్ధికి ఇది కొత్త దిశ. అమరావతి మౌలిక సదుపాయాల బలోపేతానికి కేంద్రం ఈ ప్రాజెక్టులను కీలకంగా పేర్కొంది.