BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

అమరావతిలో విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమగ్ర సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:04 AM
16 వీక్షణలు

అమరావతిలో ట్రాన్స్‌కో జేఎండీ, సీపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లు మరియు ఇతర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో  విద్యుత్  శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సబ్‌స్టేషన్ల పురోగతిని పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచనలు జారీ చేయడం జరిగింది.

విద్యుత్ అంతరాయాలు, లో-ఒల్టేజ్ సమస్యలు నివారించేందుకు అధికారులు సమన్వయంగా పనిచేయాలి. సమస్యల ఉత్పత్తి అయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. అంతరాయాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో అత్యవసర సేవలకు భూగర్భ కేబులింగ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అలాగే, ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల సమయంలో తక్షణ పునరుద్ధరణకు గల అవకాశాలను కూడా అధికారులు చర్చించారు. ఈ విధంగా విద్యుత్ శాఖను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు