BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

అమరావతిలో విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమగ్ర సమీక్షా సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:04 AM
67 వీక్షణలు

అమరావతిలో ట్రాన్స్‌కో జేఎండీ, సీపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లు మరియు ఇతర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో  విద్యుత్  శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సబ్‌స్టేషన్ల పురోగతిని పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచనలు జారీ చేయడం జరిగింది.

విద్యుత్ అంతరాయాలు, లో-ఒల్టేజ్ సమస్యలు నివారించేందుకు అధికారులు సమన్వయంగా పనిచేయాలి. సమస్యల ఉత్పత్తి అయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. అంతరాయాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో అత్యవసర సేవలకు భూగర్భ కేబులింగ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అలాగే, ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల సమయంలో తక్షణ పునరుద్ధరణకు గల అవకాశాలను కూడా అధికారులు చర్చించారు. ఈ విధంగా విద్యుత్ శాఖను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు