అమరావతిలో విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమగ్ర సమీక్షా సమావేశం
అమరావతిలో ట్రాన్స్కో జేఎండీ, సీపీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లు మరియు ఇతర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్ల పురోగతిని పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచనలు జారీ చేయడం జరిగింది.
విద్యుత్ అంతరాయాలు, లో-ఒల్టేజ్ సమస్యలు నివారించేందుకు అధికారులు సమన్వయంగా పనిచేయాలి. సమస్యల ఉత్పత్తి అయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. అంతరాయాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో అత్యవసర సేవలకు భూగర్భ కేబులింగ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అలాగే, ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల సమయంలో తక్షణ పునరుద్ధరణకు గల అవకాశాలను కూడా అధికారులు చర్చించారు. ఈ విధంగా విద్యుత్ శాఖను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు