BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై ఎస్సై సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 07:02 PM
277 వీక్షణలు

అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై ఎస్సై సూచనలు – సూరంపాలెంలో సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ సూచించారు. విగ్రహానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తగిన లైటింగ్ సదుపాయం కల్పించాలని ఆయన గ్రామస్తులకు తెలిపారు.

అదేవిధంగా అంబేద్కర్ జయంతి వేడుకలను సమన్వయంతో నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు శాంతియుతంగా జరగేలా చూడాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా అందరూ ఐక్యమత్యంతో ముందుకు రావాలని హెచ్చరించారు. ఏవైనా అశాంతి పరిస్థితులు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాలయోధుల సంఘం సభ్యులు నక్కా రాము, దార్ల సురేష్ బాబు, నక్కా చెన్నారావు, ముండ్రు వెంకటేశ్వరరావు, జక్కం కాంతారావు, దార్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సూరంపాలెం యూత్ సభ్యులు కూడా హాజరై అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు.