BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై ఎస్సై సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 07:02 PM
314 వీక్షణలు

అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై ఎస్సై సూచనలు – సూరంపాలెంలో సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ సూచించారు. విగ్రహానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తగిన లైటింగ్ సదుపాయం కల్పించాలని ఆయన గ్రామస్తులకు తెలిపారు.

అదేవిధంగా అంబేద్కర్ జయంతి వేడుకలను సమన్వయంతో నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు శాంతియుతంగా జరగేలా చూడాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా అందరూ ఐక్యమత్యంతో ముందుకు రావాలని హెచ్చరించారు. ఏవైనా అశాంతి పరిస్థితులు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాలయోధుల సంఘం సభ్యులు నక్కా రాము, దార్ల సురేష్ బాబు, నక్కా చెన్నారావు, ముండ్రు వెంకటేశ్వరరావు, జక్కం కాంతారావు, దార్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సూరంపాలెం యూత్ సభ్యులు కూడా హాజరై అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు.