BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై ఎస్సై సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 07:02 PM
357 వీక్షణలు

అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై ఎస్సై సూచనలు – సూరంపాలెంలో సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ సూచించారు. విగ్రహానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తగిన లైటింగ్ సదుపాయం కల్పించాలని ఆయన గ్రామస్తులకు తెలిపారు.

అదేవిధంగా అంబేద్కర్ జయంతి వేడుకలను సమన్వయంతో నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు శాంతియుతంగా జరగేలా చూడాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా అందరూ ఐక్యమత్యంతో ముందుకు రావాలని హెచ్చరించారు. ఏవైనా అశాంతి పరిస్థితులు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాలయోధుల సంఘం సభ్యులు నక్కా రాము, దార్ల సురేష్ బాబు, నక్కా చెన్నారావు, ముండ్రు వెంకటేశ్వరరావు, జక్కం కాంతారావు, దార్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సూరంపాలెం యూత్ సభ్యులు కూడా హాజరై అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు.