GSLV-F17/EOS-05 ప్రయోగం విజయవంతం
అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు.. ఇస్రోకు అభినందనలు
శ్రీహరికోట | Ntoday News
అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ఘనత సాధించింది. GSLV-F17/EOS-05 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
EOS-05 అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహంగా రూపొందించారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇది కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది.
కనిపించే కాంతి, ఇన్ఫ్రారెడ్, మల్టీ స్పెక్ట్రల్, హైపర్స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన చిత్రాలను సేకరించే సామర్థ్యం EOS-05కు ఉందని సమాచారం. ఈ సాంకేతిక సామర్థ్యాలు భూ పరిశీలన, పర్యావరణ అధ్యయనాలు, విపత్తుల పర్యవేక్షణ వంటి రంగాల్లో ఉపయోగపడనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అంతరిక్ష రంగంలో తన సామర్థ్యాలను మరింత విస్తరిస్తోందని పేర్కొంటూ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.
EOS-05 విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా నిలిచిందని పేర్కొంటున్నారు.