www.ntodaynews.com
అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి: కన్నీటి వీడ్కోలు పలికిన పోలీసులు..
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు... ఎస్పీ ఆదేశాల మేరకు కుటుంబానికి లక్ష రూపాయల తక్షణ సాయం.
పీ లేరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ 3175 గా పనిచేస్తున్న ది వెంకటరమణ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం జిల్లా పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది గురువారం ములకలచెరువు మండలం చౌడ సముద్రం గ్రామంలో జరిగిన అంతిమయాత్రలో పోలీసు అధికారులు, తోటి సిబ్బంది, బంధువులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
1993లో పోలీస్ శాఖలో చేరిన వెంకటరమణ, సుమారు 33 ఏళ్ల పాటు చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సేవలందించారు విధి నిర్వహణలో క్రమశిక్షణ గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన అనారోగ్యం కారణంగా మరణించడు దురదృష్టకరం ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కుటుయానికి అండగా పోలీసు శాఖ
జిల్లా ఎస్పీ శ్రీ దీరజ్ కునబిల్లి ఐపీఎస్ వెంకటరమణ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వక్తం చేశారు. దహన సంస్కారాల తక్షణ ఖర్చుల నిమిత్తం మృతుని సతీమణి భారతముకు 1. లక్ష రూపాయల నగదును అందజేశారు.
చౌడ సముద్రం గ్రామంలో వెంకటరమణ భౌతికకాయానికి పోలీసులు నివాళులర్పించారు. ఏఆర్ పోలీసుల ప్రత్యేక బృందం గాలిలోకి కాల్పులు జరిసి ప్రభుత్వ అధికార లాంఛనాలతో కడసారి గౌరవం చాటి అంత్యక్రియలు నిర్వహించారు.