BREAKING
నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అయ్యో ఆన్ లైన్ గేమ్ ఎంత పని చేసింది ​సింగరేణి విశ్రాంత ఉద్యోగులకూ రూ. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర మంచిర్యాలలో భారీ దొంగతనం ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అయ్యో ఆన్ లైన్ గేమ్ ఎంత పని చేసింది ​సింగరేణి విశ్రాంత ఉద్యోగులకూ రూ. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి మంచిర్యాలలో ఉధృతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర మంచిర్యాలలో భారీ దొంగతనం ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన
www.ntodaynews.com

అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 01:17 PM
10 వీక్షణలు
అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి: కన్నీటి వీడ్కోలు పలికిన పోలీసులు..

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు... ఎస్పీ ఆదేశాల మేరకు కుటుంబానికి లక్ష రూపాయల తక్షణ సాయం.
పీ లేరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ 3175 గా పనిచేస్తున్న ది వెంకటరమణ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం జిల్లా పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది గురువారం ములకలచెరువు మండలం చౌడ సముద్రం గ్రామంలో జరిగిన అంతిమయాత్రలో పోలీసు అధికారులు, తోటి సిబ్బంది, బంధువులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.
1993లో పోలీస్ శాఖలో చేరిన వెంకటరమణ, సుమారు 33 ఏళ్ల పాటు చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సేవలందించారు విధి నిర్వహణలో క్రమశిక్షణ గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన అనారోగ్యం కారణంగా మరణించడు దురదృష్టకరం ఆయనకు భార్య మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కుటుయానికి అండగా పోలీసు శాఖ
జిల్లా ఎస్పీ శ్రీ దీరజ్ కునబిల్లి ఐపీఎస్ వెంకటరమణ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వక్తం చేశారు. దహన సంస్కారాల తక్షణ ఖర్చుల నిమిత్తం మృతుని సతీమణి భారతముకు 1. లక్ష రూపాయల నగదును అందజేశారు.
చౌడ సముద్రం గ్రామంలో వెంకటరమణ భౌతికకాయానికి పోలీసులు నివాళులర్పించారు. ఏఆర్ పోలీసుల ప్రత్యేక బృందం గాలిలోకి కాల్పులు జరిసి ప్రభుత్వ అధికార లాంఛనాలతో కడసారి గౌరవం చాటి అంత్యక్రియలు నిర్వహించారు.