www.ntodaynews.com
అనంతపురం జిల్లాలో సంచలనం – SBI ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు
ఆంధ్రప్రదేశ్
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో ఉన్న SBI ఏటీఎం మిషన్ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
తెల్లవారుజామున రాడ్ల సహాయంతో ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డ దుండగులు, మొత్తం మిషన్ను బలవంతంగా ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
ఏటీఎం లోపల డబ్బులు ఉన్నాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. దీనిపై బ్యాంక్ అధికారులు పరిశీలన చేపట్టనున్నారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.