అన్నమయ్య జిల్లా DMHOగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ....
అన్నమయ్య జిల్లా DMHOగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ....
అన్నమయ్య జిల్లా.
మదనపల్లి.
అన్నమయ్య జిల్లా, DMHO గా డాక్టర్ శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో DMHO గా పనిచేసిన డాక్టర్ లక్ష్మీనరసయ్య ఇటీవల సస్పెండ్ కావడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు కడప జీజీహెచ్ ఆర్ఎంవోగా పనిచేస్తున్న శ్రీనివాసులను ఫుల్ అడిషనల్ ఛార్జ్ DMHO గా నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును పర్యవేక్షించడం, వైద్య సిబ్బంది సేవలను సమన్వయం చేయడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించనున్నారు. ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేస్తామని ఈ సందర్భంగా శ్రీనివాసులు తెలిపారు.