www.ntodaynews.com
అన్నమయ్య జిల్లా ఎస్పీ రూపొందించిన CMSకు ప్రతిష్టాత్మక అవార్డు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా ఎస్పీ రూపొందించిన 'CMS'కు ప్రతిష్టాత్మక అవార్డు...
అన్నమయ్య జిల్లా
మదనపల్లె.
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. రూపొందించిన వినూత్న 'కోర్టు మానిటరింగ్ సిస్టమ్' (CMS) ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.
జైపూర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఎస్పీ 'టెక్నాలజీ సభా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026'ను అందుకున్నారు.
కోర్టు కేసులు, నిందితుల వివరాలు, కేసు స్థితి మరియు పర్యవేక్షణ, కోర్టు సమన్లు, వారెంట్ల ప్రక్రియ డిజిటలైజ్ కావడం వల్ల కేసుల విచారణ వేగవంతమై, నేరస్థులకు సకాలంలో శిక్షలు పడేలా CMS వ్యవస్థ ఉపయోగపడుతుంది.