www.ntodaynews.com
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
తెలంగాణ
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి-- యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
NTODAY NEWS: భువనగిరి
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి డిస్పోజల్ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శనివారం రోజున భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగు సూచనలు సలహాలు తెలియజేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తును భూ భారతి లో నమోదు చేయాలన్నారు. ప్రతి దరఖాస్తుకు నోటీసు జారీ చేసి విచారణ చేసిన అనంతరం భూ సమస్య దరఖాస్తులు పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించి ఫైల్ ఎప్పటికపుడు డిస్పోజ్ చేయాలన్నారు.ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ ,భూ సంబంధిత సమస్యలు మార్పులు, చేర్పులు పాత రికార్డుల ఆధారంగానే పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, మండల తాహసిల్దార్ లు,అధికారులు,సిబ్బంది ఉన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube