అరుగోలనుపేట గ్రామంలో ఏ ఎస్సై అబ్దుల్ గఫార్ ఆధ్వర్యంలో కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్ట్రాయి మండలం అరుగోలనుపేట గ్రామంలో కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చాట్రాయి పోలీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో అధికారులు కొత్త చట్టాల ముఖ్యాంశాలను వివరించారు. పాత చట్టాల స్థానంలో వచ్చిన మార్పులు, న్యాయ ప్రక్రియలో వేగం పెంపు, ప్రజల హక్కులు–బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చట్టాలను సులభంగా అర్థం చేసుకుని అవసరమైనప్పుడు అధికారులను సంప్రదించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వివరించారు.
గ్రామ స్థాయిలో చట్టాలపై అవగాహన పెంపొందించడంలో గ్రామ పంచాయతీల పాత్రను అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వ సంస్కరణలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, వాటిని గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు.
సదస్సులో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. అధికారులు వాటికి సమాధానాలు ఇచ్చి ప్రజలకు స్పష్టత కల్పించారు.
చివరగా, ప్రతి గ్రామంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.