www.ntodaynews.com
జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు.
తెలంగాణ
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు.
NTODAY NEWS : పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని సుగాలిమిట్టలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవాగడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఆదివారం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సొసైటీ అధ్యక్షుడు బి. బాలాజీ మాట్లాడుతూ, పుంగనూరు పరిధిలోని 8 తాండాలు మరియు సమీప మండలాల బంజారా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేయనున్నట్లు వెల్లడించారు.
ఉత్సవాల ముఖ్య కార్యక్రమాల్లో భాగంగా భోగ్ బండార్ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సుగాలిమిట్ట సేవాగడ్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి, పుంగనూరులోని కొత్త ఇండ్లు, అంబేద్కర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, మూడేప్ప సర్కిల్ మార్గంగా ఊరేగింపు నిర్వహించనున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, పాలాభిషేకం చేయనున్నారు.
ర్యాలీ అనంతరం సేవాగడ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే బంజారా సాంస్కృతిక కార్యక్రమాలు, సేవాలాల్ భక్తి గీతాలు నిర్వహించనున్నారు. రాత్రి మరోసారి అన్నదానం చేసి, జాగారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ జయంతి ఉత్సవాలకు బంజారా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఎం. రెడ్డి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. నాగరాజ నాయక్, వైస్ ప్రెసిడెంట్ ఎం. శ్రీరాములు నాయక్, ట్రెజరర్ బి. గోపాల్ నాయక్ తదితర కమిటీ సభ్యులు మరియు 8 తాండాల పెద్దలు పాల్గొననున్నారు.
#SantSevalalMaharaj #SevalalJayanti #BanjaraCommunity #Punganur #AnnamayyaDistrict #CulturalCelebrations
Follow us on
Website
Facebook
Instagram
YouTube