www.ntodaynews.com
అసెంబ్లీలో సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న విజయ్....
జాతీయం
అసెంబ్లీలో సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న విజయ్.. వైరల్గా మారిన తీరు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన తనకు కేటాయించిన ముఖ్యమంత్రి సీటును వదిలి మంత్రుల మధ్య కూర్చున్నారు.
చర్చలు జరుగుతున్న సమయంలో మంత్రుల మధ్య నుంచే పాల్గొన్న విజయ్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యమంత్రి పదవి ప్రత్యేకమైనదే అయినా తాను కూడా మంత్రివర్గంలో భాగమేనన్న సందేశం ఇవ్వడానికే విజయ్ ఇలా వ్యవహరించారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా ముఖ్యమంత్రి స్థానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం విజయ్ ఏ కార్యక్రమం చేసినా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది.