www.ntodaynews.com
దేశంలో ఉల్లి కొరత లేదు.. కిలో రూ.35కే ఉల్లిపాయలు విక్రయం
జాతీయం
సబ్సిడీ ధరలతో ఉల్లి అమ్మకాలు ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ఉల్లిపాయల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. వినియోగదారులకు తక్కువ ధరకు ఉల్లిపాయలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ విక్రయాలను ప్రారంభించింది.
కిలో ఉల్లిని రూ.35కే అందుబాటులోకి తీసుకొచ్చింది. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ల ద్వారా ఉల్లి విక్రయాలు చేపడుతున్నారు. తొలిదశలో ఢిల్లీలో మొబైల్ వ్యాన్ల ద్వారా 40 ప్రాంతాల్లో ఉల్లిని విక్రయిస్తున్నారు.
ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రేషన్ దుకాణాల ద్వారా కూడా ఉల్లిని అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్రం చర్చలు జరుపుతోంది. మార్కెట్లో ధరల నియంత్రణ, వినియోగదారులపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.