BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 28 August 2026, 02:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశంలో ఉల్లి కొరత లేదు.. కిలో రూ.35కే ఉల్లిపాయలు విక్రయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 02:36 PM
61 వీక్షణలు

సబ్సిడీ ధరలతో ఉల్లి అమ్మకాలు ప్రారంభించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ఉల్లిపాయల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. వినియోగదారులకు తక్కువ ధరకు ఉల్లిపాయలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ విక్రయాలను ప్రారంభించింది.

కిలో ఉల్లిని రూ.35కే అందుబాటులోకి తీసుకొచ్చింది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌ల ద్వారా ఉల్లి విక్రయాలు చేపడుతున్నారు. తొలిదశలో ఢిల్లీలో మొబైల్ వ్యాన్ల ద్వారా 40 ప్రాంతాల్లో ఉల్లిని విక్రయిస్తున్నారు.

ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రేషన్ దుకాణాల ద్వారా కూడా ఉల్లిని అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్రం చర్చలు జరుపుతోంది. మార్కెట్‌లో ధరల నియంత్రణ, వినియోగదారులపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.