అశ్రునయనాల మధ్య ముల్కల్ల మల్లారెడ్డి అంతిమయాత్ర.. నివాళులర్పించిన బిజెపి నాయకులు
అశ్రునయనాల మధ్య ముల్కల్ల మల్లారెడ్డి అంతిమయాత్ర.. నివాళులర్పించిన బిజెపి నాయకులు
బిజెపి సీనియర్ నాయకులు, స్వర్గస్తులు, అమరవీరులు ముల్కల్ల మల్లారెడ్డి పార్థివ దేహానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు భౌతికకాయం వద్ద పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించి, పార్టీకి మరియు సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అనంతరం జరిగిన అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లారెడ్డికి కడసారి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర పార్టీ ప్రతినిధి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు ఆయన్నా భూమన్న, నాయకులు మున్నా రాజా సిసోడియా, ఆరుముల్లా పోశం మరియు సంఘ్ క్షేత్రాల నాయకులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు