తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ
అటెండర్ చేతివాటం తాసిల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ
కాకినాడ జిల్లా
గొల్లప్రోలు
గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అటెండర్ తన చేతివాటం ప్రదర్శిస్తూ సిమెంట్ బస్తాలు కాజేస్తున్నాడు. గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయం అభివృద్ధి పనులకు 7లక్షల రూపాయలు మంజూరు చేశారు.ఈ నిధులను వినియోగించి కార్యాలయం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాడు. అయితే కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న భూసల సత్యనారాయణ కార్యాలయంలో పనులు నిమిత్తం ఉంచిన సిమెంట్ బస్తాలపై కన్నేశాడు. సిమెంట్ బస్తాలను ఎలాగైనా కాజేయాలని
నిర్ణయించుకున్న సత్యనారాయణ ఇంటికెళ్లే సమయంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం ప్రతిరోజు సిమెంట్ బస్తాలను ఒక్కటి ఒక్కటిగా తన బండి పై తీసుకొని దొంగలించుకుని పోతున్నాడు. యధా ప్రకారం సోమవారం సాయంత్రం కార్యాలయంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న సత్యనారాయణ సిమెంట్ బస్తాను తన బండి పై వేసుకొని దొంగలించుకుని పోతుండగా స్థానికుల కంటపడ్డాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఇదేం పనిని ప్రశ్నించగా తహసిల్దార్ కు చెప్పే పట్టుకుని వెళుతున్నానని సిమెంట్ బస్తాలతో అక్కడనుండి జారుకున్నాడు.