BREAKING
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
www.ntodaynews.com

అటెండర్ ఇంట సిరి సంపదలు..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 04:15 PM
46 వీక్షణలు

అటెండర్ ఇంట ‘సిరి’ సంపదలు.. ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!

విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు ఇంటిలో, కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయటపడటంతో నగరంలో సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, విజ్ఞప్తులు వెలుగుచూశాయి.

సోదాల్లో వెలుగుచూసిన ఆస్తుల వివరాలు అటెండర్ కొండపల్లి శ్రీనివాసరావు నివాసం మరియు అతని సోదరులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించబడ్డాయి.

బంగారం, వెండి: 760 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 గోల్డ్ బిస్కెట్లు, సుమారు 7.8 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నాయి.

నగదు: వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.22 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు.

ఆస్తులు: ఒక ఖరీదైన బహుళ అంతస్తుల భవనం, నగర శివార్లలో ఉన్న ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు.

ఇంత పెద్ద సంపద ఎలా? అటెండర్ హోదాలో ఉంటూ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడబెట్టారనే ప్రశ్నకు, శ్రీనివాసరావు అధికారుల పేరును చెప్పి వ్యాపారులను బెదిరించి, భారీగా వసూళ్లను చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అక్రమ సంపాదనతో విలాసవంతమైన జీవితం గడిపిన శ్రీనివాసరావుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం, ఈ ఆస్తుల విలువ ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.