అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
పల్నాడు జిల్లా, జూన్ 8: అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో చోటుచేసుకుంది. కావూరు – కోమటినేనివారిపాలెం గ్రామాల మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
నరసరావుపేట నుంచి రాజమండ్రి వైపు కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. అతివేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.