BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

నో హెల్మెట్ – నో పెట్రోల్ పై అవగాహన

తెలంగాణ
22 Jan, 2026 - 09:15 AM
248 వీక్షణలు
నో హెల్మెట్ – నో పెట్రోల్ పై అవగాహన కార్యక్రమం NTODAY NEWS : నార్కెట్‌పల్లి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు “నో హెల్మెట్ – నో పెట్రోల్” అంశంపై నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్కెట్‌పల్లి పరిధిలోని వివిధ పెట్రోల్ బంకులను పోలీసులు సందర్శించి, హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయవద్దని బంకు యజమానులు, సిబ్బందికి స్పష్టంగా సూచించారు. హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ అందించాలని తెలిపారు. అలాగే హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నార్కెట్‌పల్లి ఎస్సై విష్ణు మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని, రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ద్విచక్ర వాహనదారుల్లో చైతన్యం పెరుగుతుందని, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నార్కెట్‌పల్లి పోలీస్ సిబ్బంది, పెట్రోల్ బంకు యజమానులు, బంకు కార్మికులు, వాహనదారులు పాల్గొన్నారు. #NoHelmetNoPetrol #RoadSafety #HelmetAwareness #TrafficRules #SaveLives #Narketpally #TelanganaPolice #RoadAccidentPrevention Follow us on Website Facebook Instagram YouTube