BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

బాబు జగ్జీవన్ రామ్ జయంతిని విజయవంతం చేయండి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
03 Apr, 2026 - 07:35 PM
106 వీక్షణలు

బాబు జగ్జీవన్ రామ్ జయంతిని విజయవంతం చేయండి..

జయంతి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అడ్లూరి..

హైదరాబాద్: 

బాబు జగ్జీవన్ రామ్ జయంతిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించే బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ప్రతి ఏటా ఏప్రిల్ 5వ తేదీన నిర్వహిస్తున్నామని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రి వర్గంలో పనిచేశారని మంత్రి గుర్తు చేశారు. 

అతి చిన్న వయసులోనూ కార్మిక శాఖ మంత్రి గా పనిచేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రక్షణ, వ్యవసాయశాఖ మంత్రితో పాటు దేశ ఉప ప్రధానిగా పని చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 

ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు.