BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

బాబు జగ్జీవన్ రామ్ జయంతిని విజయవంతం చేయండి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
03 Apr, 2026 - 07:35 PM
178 వీక్షణలు

బాబు జగ్జీవన్ రామ్ జయంతిని విజయవంతం చేయండి..

జయంతి వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అడ్లూరి..

హైదరాబాద్: 

బాబు జగ్జీవన్ రామ్ జయంతిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించే బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ప్రతి ఏటా ఏప్రిల్ 5వ తేదీన నిర్వహిస్తున్నామని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రి వర్గంలో పనిచేశారని మంత్రి గుర్తు చేశారు. 

అతి చిన్న వయసులోనూ కార్మిక శాఖ మంత్రి గా పనిచేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రక్షణ, వ్యవసాయశాఖ మంత్రితో పాటు దేశ ఉప ప్రధానిగా పని చేసి దళితుల అభ్యున్నతికి కృషి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 

ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు.