బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం: రూ. 5.40 లక్షల పరిహారం అందజేసిన మంత్రి అడ్లూరి
ధర్మపురి/వెల్గటూర్:
ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ధర్మపురి మరియు వెల్గటూర్ మండలాల్లో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.
రాయపట్నంలో రూ. 5 లక్షల చెక్కు పంపిణీ
ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన గటిక చిన్నయ్య మూడేళ్ల క్రితం విద్యుత్ షాక్తో మరణించారు. ఈ క్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును చిన్నయ్య భార్య గటిక అమ్మాయికి రాయపట్నం గ్రామ పంచాయతీ వద్ద మంత్రి అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం కొంతైనా ఆసరాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
కోటిలింగాల రైతుకు రూ. 40 వేల పరిహారం
అలాగే వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన రైతు రాపాక మహేందర్ కు చెందిన గేదె విద్యుత్ షాక్తో మరణించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం రైతుకు జరిగిన నష్టానికి గాను రూ. 40 వేల పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ చెక్కును కూడా మంత్రి లక్ష్మణ్ కుమార్ రైతుకు అందజేశారు.
పాల్గొన్న ముఖ్య నేతలు:
ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారం, గ్రామ సర్పంచ్ మొగిలి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.