BREAKING
మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం . ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ప్రజల వద్దకే పాలన.. సమస్యల పరిష్కారానికి మీ గ్రామాల్లోకే వస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభ బీఆర్ఎస్ సభనా లేక జీవన్ రెడ్డి చేరిక సభనా? ఘనంగా బూరుగుగూడెం గ్రామంలో మంత్రి కొలుసు పార్థసారథి జన్మదిన వేడుకలు పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు.పార్థసారధి గారి జన్మదిన వేడుకలు పర్వతాపురంలో ఘనంగా మంత్రి పార్ధసారధి జన్మదిన వేడుకలు మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం . ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ప్రజల వద్దకే పాలన.. సమస్యల పరిష్కారానికి మీ గ్రామాల్లోకే వస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభ బీఆర్ఎస్ సభనా లేక జీవన్ రెడ్డి చేరిక సభనా? ఘనంగా బూరుగుగూడెం గ్రామంలో మంత్రి కొలుసు పార్థసారథి జన్మదిన వేడుకలు పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు.పార్థసారధి గారి జన్మదిన వేడుకలు పర్వతాపురంలో ఘనంగా మంత్రి పార్ధసారధి జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
19 Apr, 2026 - 06:16 AM
5 వీక్షణలు

బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం: రూ. 5.40 లక్షల పరిహారం అందజేసిన మంత్రి అడ్లూరి

​ధర్మపురి/వెల్గటూర్:

ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ధర్మపురి మరియు వెల్గటూర్ మండలాల్లో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.

​రాయపట్నంలో రూ. 5 లక్షల చెక్కు పంపిణీ

​ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన గటిక చిన్నయ్య మూడేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మరణించారు. ఈ క్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును చిన్నయ్య భార్య గటిక అమ్మాయికి రాయపట్నం గ్రామ పంచాయతీ వద్ద మంత్రి అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం కొంతైనా ఆసరాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

​కోటిలింగాల రైతుకు రూ. 40 వేల పరిహారం

​అలాగే వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన రైతు రాపాక మహేందర్ కు చెందిన గేదె విద్యుత్ షాక్‌తో మరణించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం రైతుకు జరిగిన నష్టానికి గాను రూ. 40 వేల పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ చెక్కును కూడా మంత్రి లక్ష్మణ్ కుమార్ రైతుకు అందజేశారు.

​పాల్గొన్న ముఖ్య నేతలు:

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారం, గ్రామ సర్పంచ్ మొగిలి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.