BREAKING
ధాన్యం దిగుమతి నిబంధనల ప్రకారమే జరగాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు ద్రావిడ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్ ​చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ బంగారు బాట ​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి చిట్యాలలో రైతు అవగాహన సదస్సు ​ప్రపంచ దేశాలకు ఆదర్శం మన ప్రజాస్వామ్యం బాకీ వివాదం.. వివాహిత హత్య.. పరిశుభ్రమైన రాయచోటి నిర్మాణమే లక్ష్యం తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం ధాన్యం దిగుమతి నిబంధనల ప్రకారమే జరగాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు ద్రావిడ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: సర్పంచ్ ఆవల సుందర్ ​చిన్నారుల భవిష్యత్తుకు అంగన్‌వాడీ బంగారు బాట ​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి చిట్యాలలో రైతు అవగాహన సదస్సు ​ప్రపంచ దేశాలకు ఆదర్శం మన ప్రజాస్వామ్యం బాకీ వివాదం.. వివాహిత హత్య.. పరిశుభ్రమైన రాయచోటి నిర్మాణమే లక్ష్యం తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పల్లపు బుద్ధుడు నియామకం
www.ntodaynews.com

బాకీ వివాదం.. వివాహిత హత్య..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 07:17 PM
28 వీక్షణలు

బాకీ వివాదం.. వివాహిత హత్య.. కాలువ సమీపంలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి

ఏలూరు జిల్లా, నూజివీడు: బాకీ డబ్బుల వివాదం నేపథ్యంలో ఓ వివాహితను హత్య చేసి, శవాన్ని పాతిపెట్టిన ఘటన సంచలనం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్లూరు శివారు శౌరిపురానికి చెందిన వైశాలి (34) గత నెల 18వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు, వైశాలి ఫోన్ కాల్ వివరాల ఆధారంగా అదే గ్రామానికి చెందిన ఫ్రాన్సిస్ శౌరిని అనుమానితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, బాకీ డబ్బుల వ్యవహారంలో తలెత్తిన వివాదం కారణంగా వైశాలిని నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ శివారులోని పోలవరం కాలువ ప్రాంతానికి రప్పించి హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం శవాన్ని అక్కడే పాతిపెట్టినట్లు తెలిపిన నేపథ్యంలో, పోలీసులు గురువారం శవాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని డీఎస్పీలు శ్రావణ్ కుమార్, కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, నూజివీడు రూరల్ సీఐ ఐ.వి. నాగేంద్ర కుమార్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.