BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బాకీ వివాదం.. వివాహిత హత్య..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 07:17 PM
180 వీక్షణలు

బాకీ వివాదం.. వివాహిత హత్య.. కాలువ సమీపంలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి

ఏలూరు జిల్లా, నూజివీడు: బాకీ డబ్బుల వివాదం నేపథ్యంలో ఓ వివాహితను హత్య చేసి, శవాన్ని పాతిపెట్టిన ఘటన సంచలనం సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్లూరు శివారు శౌరిపురానికి చెందిన వైశాలి (34) గత నెల 18వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు, వైశాలి ఫోన్ కాల్ వివరాల ఆధారంగా అదే గ్రామానికి చెందిన ఫ్రాన్సిస్ శౌరిని అనుమానితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, బాకీ డబ్బుల వ్యవహారంలో తలెత్తిన వివాదం కారణంగా వైశాలిని నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ శివారులోని పోలవరం కాలువ ప్రాంతానికి రప్పించి హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం శవాన్ని అక్కడే పాతిపెట్టినట్లు తెలిపిన నేపథ్యంలో, పోలీసులు గురువారం శవాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు.

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని డీఎస్పీలు శ్రావణ్ కుమార్, కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, నూజివీడు రూరల్ సీఐ ఐ.వి. నాగేంద్ర కుమార్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.