www.ntodaynews.com
ఈ నెల 20 తర్వాత వర్షాలకు అవకాశం
జాతీయం
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వాతావరణ నిపుణులు ఊరటనిచ్చే అంచనాలు వెల్లడించారు.
బంగాళాఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు సుమారు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల మేర ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) విస్తరించినట్లు తెలిపారు. దీని ప్రభావంతో వెచ్చని, తేమతో కూడిన గాలులు పైకి ఎగసి భారీ వర్ష మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జూలై 20 నుంచి 30 మధ్య దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఏ ప్రాంతాల్లో ఎంత మేర వర్షపాతం నమోదవుతుందనే విషయంపై భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసే తాజా బులెటిన్లను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.