నిర్మా డిటర్జెంట్తో కల్తీ పాలు.. రూ.9.21 కోట్ల సింథటిక్ పాల రాకెట్ బట్టబయలు
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో భారీ కల్తీ పాల రాకెట్ను అధికారులు బయటపెట్టారు. ఆరు నెలల వ్యవధిలో 2,30,470 కిలోల నాసిరకం పాలపొడిని ఉపయోగించి సుమారు 2.3 కోట్ల లీటర్ల సింథటిక్ పాలు తయారు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కల్తీ పాల విలువ సుమారు రూ.9.21 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
దర్యాప్తులో ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల సింథటిక్ పాలను కలిపి విక్రయించినట్లు గుర్తించారు. నిర్మా డిటర్జెంట్ పౌడర్, పామాయిల్తో పాటు నాసిరకం రసాయనాలను ఉపయోగించి ఈ కల్తీ పాలను తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. నిందితులంతా పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు పాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.