www.ntodaynews.com
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కంపసాటి నాగేశ్వరరావు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంపసాటి నాగేశ్వరరావు ఈరోజు కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన నేతగా కంపసాటి నాగేశ్వరరావు గుర్తింపు పొందారు. ఆయన మరణం చాట్రాయి గ్రామానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కంపసాటి నాగేశ్వరరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని పలువురు నివాళులర్పించారు.