BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జీవో 396కు వ్యతిరేకంగా జూలై 20 నుంచి పెన్‌డౌన్ సమ్మె: గిద్దలూరు దస్తావేజు లేఖరుల సంఘం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 09:36 PM
14 వీక్షణలు

గిద్దలూరు: రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.396 అమలుకు వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి 31 వరకు చేపట్టనున్న పెన్‌డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిద్దలూరు దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు కోరే సుబ్బారావు పిలుపునిచ్చారు.

సోమవారం సాయంత్రం సంఘం కార్యదర్శి గర్రె రామ్ ప్రసాద్ కార్యాలయంలో నిర్వహించిన దస్తావేజు లేఖరులు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 అమలైతే దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణతో ప్రజల ఆస్తుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 396ను ఉపసంహరించుకుని, ప్రతిపాదిత రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జూలై 20 నుంచి 31 వరకు జరిగే పెన్‌డౌన్ సమ్మెను విజయవంతం చేసేందుకు సభ్యులందరూ కృషి చేయాలని, సమ్మె ఉద్దేశాన్ని ప్రజలకు, కక్షిదారులకు వివరించాలని కోరారు. సమావేశంలో దస్తావేజు లేఖరులు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు పాల్గొన్నారు.