www.ntodaynews.com
బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు
గుడిపేట: గుడిపేట సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కొండగట్టు నుంచి నస్పూర్ వైపు వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో సీతారాంపల్లికి చెందిన తిరుపతి, రాజ్ కుమార్లకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు అందించిన సమాచారంతో హాజీపూర్ 108 సిబ్బంది ఈ.ఎం.టి రాంబాబు, పైలట్ గోపి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు