బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు.
బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితంగా సిద్ధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మనందరికీ గర్వకారణమని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే మన బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.