22A నిషేధిత జాబితాపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
ప్రజల భూములు, ఇళ్లను 22Aలో చేర్చడంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణ ప్రజల భూములు, ఇళ్లను నిషేధిత జాబితాలోని 22A కేటగిరీలో చేర్చుతున్న అంశంపై చర్చించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
ప్రజలకు సంబంధించిన భూములు, ఇళ్లను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, ఆస్తులపై హక్కులు, రిజిస్ట్రేషన్ సమస్యలపై శాసనసభలో సమగ్రంగా చర్చించాలని బీజేపీ శాసనసభ పక్షం కోరింది.
ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.