బండోనిగూడ గుంటి మల్లన్న స్వామి దేవాలయానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి భారీ విరాళం
ధ్వజస్తంభం, విగ్రహాల ఏర్పాటుకు రూ.3.50 లక్షల సహాయం
నందిగామ మండలం బండోనిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గుంటి మల్లన్న స్వామి దేవాలయ అభివృద్ధికి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి విశేష సహకారం అందించారు. దేవాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ఠాపన కోసం సుమారు రూ.3.50 లక్షల విలువైన సామగ్రిని అందజేశారు.
ఎమ్మెల్సీ సహకారంతో ధ్వజస్తంభం, విగ్రహాల ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ నెల 17న నిర్వహించనున్న గుంటి మల్లన్న స్వామి దేవాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గ్రామస్తులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బండ మల్లేష్, బండ శ్రీను, బండ రవి, బండ నర్సిమ, బండ కుమార్, జక్కం శ్రీశైలం, జాలగూడెం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.