BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బూరుగుగూడెం నుంచి రామ భక్తుల భద్రాచలం పాదయాత్ర.. రామనామ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 06:40 PM
210 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రామ భక్తులు భక్తి ఉత్సాహంతో కాలినడకన భద్రాచలం వైపు పాదయాత్ర ప్రారంభించారు. గ్రామం మొత్తం రామ నామస్మరణతో మారుమోగగా, ఉదయం వేళ భజనల మధ్య భక్తులు బయలుదేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాదయాత్ర ప్రారంభ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ…

“ఎండ, వాన, దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా రామ నామమే మాకు బలం. ప్రతి అడుగు సీతారాముల సేవగా భావించి ముందుకు సాగుతున్నాం. భద్రాచలం చేరి స్వామివారి దర్శనం చేసుకుంటే జీవితంలో పునర్జన్మ లభించినంత ఆనందం కలుగుతుంది. ఈ యాత్ర మా గ్రామానికి ఆధ్యాత్మిక శోభ తీసుకువచ్చింది” అని భావోద్వేగంగా తెలిపారు.

భక్తుల చేతుల్లో రామనామ జెండాలు, నినాదాలతో మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికులు పూలతో వీడ్కోలు పలుకుతూ యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.