బూరుగుగూడెం నుంచి రామ భక్తుల భద్రాచలం పాదయాత్ర.. రామనామ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రామ భక్తులు భక్తి ఉత్సాహంతో కాలినడకన భద్రాచలం వైపు పాదయాత్ర ప్రారంభించారు. గ్రామం మొత్తం రామ నామస్మరణతో మారుమోగగా, ఉదయం వేళ భజనల మధ్య భక్తులు బయలుదేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాదయాత్ర ప్రారంభ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ…
“ఎండ, వాన, దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా రామ నామమే మాకు బలం. ప్రతి అడుగు సీతారాముల సేవగా భావించి ముందుకు సాగుతున్నాం. భద్రాచలం చేరి స్వామివారి దర్శనం చేసుకుంటే జీవితంలో పునర్జన్మ లభించినంత ఆనందం కలుగుతుంది. ఈ యాత్ర మా గ్రామానికి ఆధ్యాత్మిక శోభ తీసుకువచ్చింది” అని భావోద్వేగంగా తెలిపారు.
భక్తుల చేతుల్లో రామనామ జెండాలు, నినాదాలతో మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికులు పూలతో వీడ్కోలు పలుకుతూ యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.