బూరుగుగూడెంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రేపు
బూరుగుగూడెంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రేపు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో రేపు అనగా 03-04-2026న మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు గడ్డం అప్పిరెడ్డి పామాయిల్ తోటలో గ్రామసభ ఏర్పాటు చేసి, గ్రామంలో భూములున్న రైతులకు మాత్రమే పాసుపుస్తకాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఈ రోజు బూరుగుగూడెం సచివాలయంలో ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ కొనసాగుతున్నదని, రైతులు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే రేపు కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో తమ పాత పాసుపుస్తకాలను వెంట తీసుకురావాలని చాట్రాయి తహసిల్దార్ బద్రు ఒక ప్రకటనలో వెల్లడించారు.
రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాసుపుస్తకాలను పొందాలని అధికారులు కోరుతున్నారు.